శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (11:37 IST)

ధోనీ Vs కోహ్లీ: ఐపీఎల్-8 ఫైనల్స్ అర్హత సాధించే జట్టు ఏది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర మ్యాచ్ శుక్రవారం జరగనుంది. భారత టెస్టు డట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే జట్టు కెప్టెన్ ధోనీల నేతృత్వంలోని బెంగళూరు, చెన్నై జట్లు ఫైనల్‌లో స్థానం కోసం క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తలపడనున్నాయి. రాంచీలో జరిగే ఈ మ్యాచ్ కోసం కేటాయించిన టిక్కెట్లన్నీ అమ్ముడుపోగా, ఈ పోరు అభిమానులను అలరిస్తుందని క్రీడాపండితులు భావిస్తున్నారు. 
 
కెప్టెన్ కూల్‌గా పేరున్న ధోనీ, తన టీంను గెలిపిస్తాడా? లేదా మంచి దూకుడు మీదున్న కోహ్లీ దాన్ని కొనసాగిస్తాడా? అన్నది శుక్రవారం తేలనుంది. ఈ పోరులో గెలిచే జట్టు ఆదివారం నాడు ముంబైతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు సగం గెలిచినట్టేనని అంచనా.