శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (12:38 IST)

కోహ్లీ ఆ మార్పులు అవసరమా? సచిన్ వార్నింగ్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించారు. కోహ్లీ చర్యల వల్ల టీమిండియా ట్వంటీ-20 సిరీస్‌ల్లో రాణించలేకపోతుందని ధ్వజమెత్తారు. ఇంకా అప్పుడప్పుడు జట్టులో మార్పులు చేయడం మంచి పద్ధతి కాదని కోహ్లీకి సూచించారు.


ఇందుకు ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌లను కోల్పోయిన ఫలితాలే కారణమని సచిన్ గుర్తు చేశారు. జట్టులో అప్పుడప్పుడు మార్పులు చేయడం ద్వారా ఆ ప్రభావం క్రికెటర్లపై వుంటుందని క్రికెట్ దేవుడు తెలిపారు. 
 
వన్డేల్లో టీమిండియా రాణించడంతో భారత జట్టు ఫామ్‌లో వుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ట్వంటీ-20 సిరీస్‌లో టీమిండియా మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోతుండటం ద్వారా కోహ్లీ సేనపై క్రికెట్ ఫ్యాన్సే కాదు.. మాజీ క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రీతిలోనే సచిన్ కూడా టీమిండియా ట్వంటీ-20 ఫార్మాట్‌లో మెరుగ్గా రాణించాలని చెప్పాడు. 
 
ఇంకా జట్టులో మార్పులు చేయడం.. ముఖ్యంగా కొన్నేళ్లుగా ఓపెవర్లుగా రాణిస్తున్న రోహిత్ శర్మ- శిఖర్ ధవాన్ ద్వయాన్ని మార్చడం సబబు కాదని సచిన్ కోహ్లీకి హితవు పలికాడు. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రాణించినప్పటికీ.. అతనితో భాగస్వామ్యం నెలకొల్పిన శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మెరుగ్గా ఆడలేకపోయారని సచిన్ గుర్తు చేశాడు.

ఈ ప్రభావం మ్యాచ్ ఫలితంపై పడుతుందని.. అందుచేత ప్రపంచ కప్ వరకు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను ఓపెనర్ల బరిలోకి దించాలని సచిన్ పేర్కొన్నాడు. ఈ ప్రభావం మ్యాచ్ ఫలితంపై పడుతుందని.. అందుచేత ప్రపంచ కప్ వరకు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను ఓపెనర్ల బరిలోకి దించాలని సచిన్ పేర్కొన్నాడు.