శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (10:20 IST)

ధోనీకి సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. అవుటైతే పర్లేదు.. టీ-20ల్లో పరుగులే ముఖ్యం

కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో నిలదొక్కుకుని కూడా చేయాల్సిన రన్ రేట్ చేయకుండా.. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, రెండో టీ-20 మ్యాచ్ తర

కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో నిలదొక్కుకుని కూడా చేయాల్సిన రన్ రేట్ చేయకుండా.. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, రెండో టీ-20 మ్యాచ్ తరువాత ధోనీని అనిల్ కుంబ్లే వంటి ఆటగాళ్లు విమర్శించగా, గవాస్కర్ వంటి వారు వెనకేసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ ఆటతీరుపై వస్తున్న విమర్శల సందర్భంగా సెహ్వాగ్ స్పందించాడు. 
 
ధోనీకి విలువైన సలహా ఇచ్చాడు. వన్డేలతో పోలిస్తే, టీ-20ల్లో పరిస్థితి వేరుగా ఉంటుందన్నాడు. ఇది ధోనీకి తెలియని విషయమేమ కాదంటూనే.. మిడిలార్డర్‌లో వచ్చే ధోనీ.. నిలదొక్కుకునేందుకు ప్రయత్నించకుండా, తొలి బాల్ నుంచే పరుగులు చేసేందుకు ప్రయత్నించాలన్నాడు. ఈ ప్రయత్నంలో అవుటైపోయినా పర్లేదు కానీ, క్రీజులో పాతుకుపోయి పరుగులు చేయకుండా ఉండటం సరికాదన్నాడు. 
 
ఆడిన నాలుగు బంతులనూ బౌండరీలకు పంపితే, టీ-20ల్లో మేలు కలుగుతుందని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. సాధించాల్సిన పరుగులు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు, ధోనీ వంటి ఆటగాడు, వేగాన్ని పెంచలేకపోతే ఆ ప్రభావం జట్టు మీద పడుతుందని తెలిపాడు.