శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (16:08 IST)

బాపట్ల యువ క్రికెటర్ వీరబాదుడు.. 29 బంతుల్లో 100 రన్స్...

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ వీరబాదుడి తరహాలో బాపట్ల కుర్రోడు రెచ్చిపోయాడు. బాపట్లకు చెందిన పల్లప్రోలు రవీంద్ర, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ వీరబాదుడి తరహాలో బాపట్ల కుర్రోడు రెచ్చిపోయాడు. బాపట్లకు చెందిన పల్లప్రోలు రవీంద్ర, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-22 జోనల్స్ పోటీల్లో కేవలం 29 బంతుల్లో 102 పరుగులు చేశాడు. దీంతో అండర్-22 క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 
 
జింఖానా క్లబ్ తరఫున ఆడిన రవీంద్ర, జైదుర్ క్లబ్‌తో జరిగిన పోటీల్లో 29 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. మొత్తం 58 బంతులాడిన రవీంద్ర, 13 సిక్స్‌లు, 4 ఫోర్లతో 144 పరుగులు సాధించడం గమనార్హం. రంజీ జట్టుకు ఎంపిక కావడం తన తదుపరి లక్ష్యమని, ఆపై భారత జట్టులో స్థానానికి కృషి చేస్తానని చెప్పే రవీంద్ర, లెగ్ స్పిన్నర్‌గా రాణించడం గమనార్హం.