శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 13 జులై 2017 (17:50 IST)

తాళము వేసితిని... గొళ్లెము మరిచితిని... ఇదీ విరాట్ కోహ్లి పరిస్థితి...

భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ప్రపంచ 6000 పరుగుల రికార్డును నెలకొల్పడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఒన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఇప్పటివరకూ ఇంగ్లండ్ మహిళా బ్యాట్సమన్ చార్లెట్ ఎడ్వర్డ్

భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ప్రపంచ 6000 పరుగుల రికార్డును నెలకొల్పడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఒన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఇప్పటివరకూ ఇంగ్లండ్ మహిళా బ్యాట్సమన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరున నమోదైన 5992 పరుగులు రికార్డున చెరపేసి 5993 పరుగులతో రికార్డు సృష్టించిన మిథాలీని కొనియాడుతున్నారు. 
 
ఎడ్వర్డ్స్ ఈ పరుగులు రికార్డున 191 మ్యాచుల్లో ఆడి సాధించగా మిథాలీ 183 మ్యాచులతోనే సాధించేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ కూడా తన అభినందనలు తెలియజేశాడు. ఐతే ఆయన చేసిన కామెంట్లు, ఆ కామెంట్లకు పైన పెట్టిన ఫోటో చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. 
 
తాళము వేసితిని గొళ్లెము మరిచితిని అన్నట్లుగా కోహ్లి చేసిన పని వుందంటూ కామెంట్స్ చేశారు. దీనికి కారణం... కోహ్లి పొగిడిందేమో మిథాలీని.. కానీ ఫోటో మాత్రం మరో మహిళా క్రికెటర్ పూనమ్ రౌత్ ఫోటోను పెట్టాడు. దీంతో కామెంట్లే కామెంట్లు. వీటి దెబ్బకు తట్టుకోలేని కోహ్లి ఆ పోస్టును డిలీట్ చేసి హ్యాపీగా న్యూయార్క్ హాలీడే ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అదీ సంగతి.