పెళ్ళి ప్రతిపాదనే కొంపముంచింది.. అనుష్క బ్రేకప్ ఇచ్చింది: ఒంటరిగా కోహ్లీ డ్యాన్స్
ప్రేమ పావురాల్లా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలిద్దరూ బ్రేకప్కు ఓకే అనేశారని తెలుస్తోంది. వీరిద్దరి బ్రేకప్కు విరాట్ కోహ్లీ చేసిన వివాహ ప్రతిపాదనే కారణమని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ఈ ఏడాదే పెళ్ళి చేసుకుందామని చెప్పడంతో... అనుష్క అందుకు ఓకే చెప్పలేదని తెలిసింది. దీంతో అనుష్కపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ.. ఆమెకు దూరమయ్యాడు. అనుష్క కూడా కోహ్లీకి దూరంగానే ఉంటూ తను నటించే బాలీవుడ్ చిత్రాల్లో బిజీ అయిపోయింది.
ఒకప్పుడు సిడ్నీ వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని, పబ్ల్లో, పార్క్ల్లో షికారు చేసిన ఈ జంట బ్రేకప్కు అధికారికంగా ఒప్పుకుంది. ప్రస్తుతానికి లవ్ వరకూ ఓకే, పెళ్లి మాత్రం ఇప్పుడల్లా వద్దని అనుష్క తెగేసి చెప్పడంతో, కోహ్లీ పెళ్లికి తొందరపెడుతుండటంతో బ్రేకప్ చెప్పాలని అనుష్క శర్మ ఆలోచించిందట. ఓ బాలీవుడ్ వెబ్సైట్ సమాచారం ప్రకారం వీరిద్దరూ అఫిషియల్గా తమ బ్రేకప్ను అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే విరాట్ కోహ్లి మనసు మాత్రం ఇంకా అనుష్క చుట్టూనే తిరుగుతున్నట్టుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం హృదయం ముక్కలైందంటూ కోహ్లి ఓ వ్యాఖ్య రాసి తన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. తర్వాత ఏమైందో గానీ వెంటనే ఆ ఫొటోను తొలగించాడు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. దీంతో తొలగించిన ఆ ఫొటోను మళ్లీ పెట్టాడు.
‘ఆ ఫొటోను తీసేసి నేనేదో నేరానికి పాల్పడినట్లుంది. క్షమించండి. ఇదిగో మళ్లీ పెడుతున్నా' అంటూ రాసుకొచ్చాడు. మరోవైపు శనివారం రాత్రి ఓ నైట్క్లబ్లో జరిగిన బాలీవుడ్ నటుడు అంగద్ బేడి పుట్టినరోజు పార్టీకి హాజరైన కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘నేను ఇప్పుడు ఒంటరిని. నాతో నృత్యం చేయండి' అని పార్టీకి వచ్చిన వారితో కోహ్లీ తెలిపాడు. దీనిని బట్టి అనుష్కతో కోహ్లీ ప్రేమాయణం కట్ అయినట్లే తెలుస్తోందని బాలీవుడ్ జనం అనుకుంటున్నారు.