శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (19:30 IST)

రోహిత్ శర్మకు భారీ జరిమానా: రూ.12లక్షల జరిమానా వడ్డన!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో ఆడుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడడంతో అతడికి రూ.12 లక్షల జరిమానా వడ్డించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ నియమావళి అనుసరించి, తొలి తప్పిదంగా భావించి రోహిత్‌కు ఈ జరిమానా విధించినట్టు లీగ్ నిర్వాహకులు చెప్పారు. 
 
పశ్చిమ బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి మృతి పట్ల బాలీవుడ్ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుక్ ఖాన్ స్పందించారు. అతని మరణం అత్యంత దురదృష్టకరం, విచారకరమని తన ట్విట్టర్ ఖాతాలో సంతాపం వ్యక్తం చేశారు. "చాలా చిన్న వయసులోనే వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా కేసరికి, అతని కుటుంబ సభ్యులకు నా సంతాపం, ప్రార్థనలు తెలుపుతున్నా. అతని ఆత్మకు శాంతి కలగాలని ఆ అల్లాను కోరుతున్నా" అని షారుక్ ట్వీట్ చేశారు.