వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు రూ. 250 కోట్లు ఫైన్: బీసీసీఐ
భారతదేశంలో సిరీస్ను అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్లినందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు రూ. 250 కోట్లు ఫైన్ చెల్లించాల్సిందేనని బీసీసీఐ డిమాండ్ చేసింది. వెస్టిండీస్ జట్టు భారత సిరీస్ను సగంలో వదిలిపెట్టి వెళ్లిపోయినందుకు తమకు భారీ నష్టం వాటిల్లిందని, వెంటనే దీనికి సంబంధించిన పరిష్కారంతో ముందుకు రావాలంటూ వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ ఓ లేఖ రాసింది.
ఆ లేఖలో కేవలం మీడియా హక్కుల రూపంలోనే బీసీసీఐకి 35 మిలియన్ డాలర్ల నష్టం ఏర్పడిందని తెలిపింది. టికెట్ అమ్మకాల రూపంలో మరో 2 మిలియన్ డాలర్లు, టైటిల్ స్పాన్సర్షిప్ కోసం మైక్రోమాక్స్కు 1.6 మిలియన్ డాలర్లు.. ఇలా భారీ నష్టమే వాటిల్లిందని బీసీసీఐ పేర్కొంది.
ఇంతేకాకుండా ఇంకా నైక్ ఇచ్చిన కిట్ స్పాన్సర్షిప్.. ఇలాంటివి చాలా ఉన్నాయని ఆ లెక్కన మొత్తం రూ. 250 కోట్ల లను 15 రోజుల లోపు వెస్టిండీస్ బోర్డు చెల్లించాలని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ లేఖలో రాశారు.