శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (12:44 IST)

బాస్ వివాదం: మీడియాకు మొహం చాటేసిన టీమిండియా!

డంకెన్ ఫ్లెచర్ విషయంలో కెప్టెన్ ధోనీకి, బిసిసిఐ అధికారులకు మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇంగ్లాండుతో రెండో వన్డే మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మీడియాకు మొహం చాటేసింది.
 
మ్యాచ్‌కు ముందు జట్టు సభ్యుల్లో ఎవరో ఒకరు మీడియా సమావేశంలో పాల్గొనడం ఆనవాయితీ. కానీ తాజా వివాదంతో ఏ క్రికెటర్ కూడా మీడియా ముందుకు రాలేదు. 2015 ప్రపంచ కప్ పోటీల వరకు డంకెన్ ఫ్లెచర్ ‌బాస్‌గా ఉంటాడంటూ ధోనీ చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది.
 
ధోనీ ఆ ప్రకటన ద్వారా తన హద్దులను దాటాడని బిసిసిఐ అభిప్రాయపడింది. రవిశాస్త్రి జట్టు డైరెక్టర్‌గా నియమితులైన నేపథ్యంలో బాస్ ఎవరనే ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే జట్టు యాజమాన్యం మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. జట్టు నెట్ ప్రాక్టీస్ సమయంలో రవిశాస్త్రి, ఫ్లెచర్ ఇద్దరూ ఉన్నారు. కానీ మీడియా సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నారు.