శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (17:59 IST)

శ్రీలంకతో వన్డే సిరీస్ : మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యం!

శ్రీలంకతో జరుగనున్న వన్డే సిరీస్‌లో భాగంగా మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్య మివ్వనుంది. వెస్టిండీస్ జట్టు టూర్ మధ్యలో వైదొలగడంతో ఆ లోటును భర్తీ చేసుకోవడానికి బీసీసీఐ శ్రీలంకతో వన్డే సిరీస్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం బీసీసీఐ ఖరారు చేసింది. నవంబర్ 2న కటక్ వన్డేతో ఈ సిరీస్ ఆరంభమవుతుంది. ఈ 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నవంబర్ 9న జరిగే మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
 
వాస్తవానికి హైదరాబాదులో విండీస్‌తో టెస్టు జరగాల్సి ఉంది. టూర్ రద్దవడంతో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఊరట కలిగించేలా బీసీసీఐ ఓ వన్డేను కేటాయించింది.