శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (14:12 IST)

లంకతో ఐదు వన్డేల సిరీస్: మహ్మద్ షమీ అవుట్!

శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ నుంచి టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తప్పుకున్నాడు. గాయం కారణంగా అతని స్థానంలో ముంబై మీడియం పేసర్ ధవళ్ కులకర్ణిని ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది. 
 
షమీ కుడికాలి వేలి గాయంతో బాధపడుతున్నాడని, అతనికి పది రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించడంతో షమీని జట్టు నుంచి తొలగించినట్లు సమాచారం. 
 
కాగా, షమీ స్థానాన్ని భర్తీ చేస్తున్న కులకర్ణి ఈ ఏడాదే అంతర్జాతీయ వన్డే (ఇంగ్లండ్ పై) అరంగేట్రం చేశాడు. తాజాగా, దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.