చెన్నై సూపర్ సింగ్స్ పనైపోయిందా? నీటి బుడగలా కింగ్స్ భవిష్యత్తు?!
చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తు నీటి బుడగలా మారింది. స్టార్ క్రికెటర్లతో ఐపీఎల్లో అద్భుతమైన ట్రాక్తో ఎన్నో రికార్డులు, విజయాలను తన ఖాతాలో వేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీపై ఏ క్షణంలోనైనా వేటు పడే అవకాశాలు సుస్పష్టమవుతున్నాయి.
ఐపీఎల్-6లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్లో గురునాథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుండటమే దీనికి కారణం. గురునాథ్, విందూ దారాసింగ్ మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెప్పారు. సంభాషణలోని గొంతు గురునాథ్దే అని స్పష్టం చేశారు.
దీనికి సంబంధించిన నివేదికను త్వరలోనే ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఈ క్రమంలో, చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడే గురునాథ్ కావడం గమనార్హం.