శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (18:51 IST)

విండీస్‌తో వన్డే సిరీస్ : గాయంతో రోహిత్ శర్మ దూరం!

విండీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఇంగ్లండ్ టూర్‌లో గాయపడిన రోహిత్ శర్మ విండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో ఆడే అవకాశాలు కనపడడం లేదు. అక్టోబర్ 8 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 30 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. 
 
ఈ నేపథ్యంలో రోహిత్ ఫిట్ నెస్ లేమి అతని స్థానంపై అనుమానం రేకెత్తిస్తోంది. మిడిలార్డర్‌లో సమర్థవంతంగా ఆడగలిగే రోహిత్, మంచి ఓపెనర్‌గా కూడా రాణించగలడు. మంచి ఫీల్డర్ కూడా. దీంతో అతను విండీస్ సిరీస్‌కు కోలుకుంటాడని బీసీసీఐ భావించింది. 
 
ఇంగ్లండ్ సిరీస్‌లో గాయపడిన రోహిత్‌కు వైద్యులు నాలుగు వారాల విశ్రాంతి సూచించారు. అనుకున్న ప్రకారమే చేతి వేలి గాయం తగ్గింది. కానీ, భుజం నొప్పి తిరగబెట్టింది. దీంతో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ లో రోహిత్ ఆడేది అనుమానమే. చేతి వేలి గాయంతో ఇప్పటికే చాంపియన్స్ లీగ్ టి20 టోర్నమెంట్ అతడు దూరమైన సంగతి తెలిసిందే.