రోహిత్ శర్మకు గాయం : సీఎల్ టీ-20లో ఆడేది లేదు!
భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను వేలి గాయం వేధిస్తోంది. దీని కారణంగా అతను చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్లో ఆడబోడని జట్టు కోచ్ జాన్ రైట్ ప్రకటించాడు.
డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి ఇప్పుడు ఎవరు నాయకత్వం వహిస్తారన్న విషయంపై ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని రైట్ తెలిపాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కార్డ్ఫిలో రెండో వన్డే ఆడుతూ రోహిత్ శర్మ గాయపడ్డాడు.
అతని కుడచేతి మధ్య వేలు ఎముక చిట్లింది. ఫలితంగా మిగతా మూడు వన్డేల్లో అతను ఆడలేకపోయాడు. స్వదేశానికి వచ్చిన తర్వాత మరోసారి వైద్య పరీక్షలు చేయించుకున్న రోహిత్కు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.