పాకిస్థాన్ దేశవాళీ క్రికెటర్లకు సానియా మీర్జా ఇంట్లో బిర్యానీ విందు!
పాకిస్థాన్ దేశవాళీ క్రికెటర్లు హైదరాబాద్ టెన్నిస్ ఏస్, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా తన నివాసంలో బిర్యానీ విందు ఇచ్చారు. అయితే, ఈ విందు పార్టీని తన భర్త, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేరుతో ఇవ్వడం గమనార్హం. తన అత్తారిల్లు అయిన సానియా మీర్జా ఇంట్లో ఈ పసందైన బిర్యానీ విందు ఇచ్చాడు.
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ సందర్భంగా పాక్ దేశవాళీ జట్టు లాహోర్ లయన్స్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చింది. భార్య సానియా మీర్జా స్వస్థలం హైదరాబాదే కావడంతో షోయబ్ మాలిక్ తన టీం మెంబర్స్కు మంచి విందు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వారిని సంతృప్తి పరచడానికి హైదరాబాదీ బిర్యానీని మించిన డిష్ ఇంకేముంటుంది..? దాంతో, మనవాడూ అదే వడ్డించాడు.