శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2015 (16:53 IST)

శివాజీ దీక్షలా తుస్సుమన్న జగన్ దీక్ష.. ఫ్లూయిడ్స్ దీక్ష చేసుంటే బెటరేమో..?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష తుస్సుమంది. కొన్ని నెలల క్రితం శివాజీ చేపట్టిన దీక్ష లాగానే జగన్ దీక్ష ప్రయోజనం లేకుండా పోయింది. జగన్ దీక్షను ఏపీ సర్కారు భగ్నం చేసి ఆయన్ని ఆస్పత్రికి తరలించింది. అయితే జగన్ ఫ్లూయిడ్స్ దీక్ష కొనసాగించి వుంటే తప్పకుండా ప్రత్యేక హోదా డిమాండ్‌కు మరింత పట్టు లభించి వుండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
అంతేగాకుండా జగన్మోహన్ రెడ్డి తన దీక్షా వేదికను గుంటూరును ఎంచుకుని ఉండకూడదని.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఢిల్లీలో ఆయన దీక్ష చేపట్టి వుంటే రెస్పాన్స్ అదిరిపోయేదని విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీకి దూరంగా గుంటూరులో జగన్ దీక్ష చేపట్టడం ద్వారా ఏపీ ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు నోట కూడా హోదా మాట రానీయకుండా తుస్సుమందని వారు చెప్తున్నారు.
 
శివాజీ దీక్షైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ సాగిందని.. అదే జగన్ దీక్షకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడ్ని కూడా కదిలించలేకపోయిందన్నారు. జగన్ దీక్షకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ చంద్రబాబు నోట హోదా మాట కరువైంది. మొత్తానికి హోదా పేరిట జగన్ చేసిన దీక్ష ఏపీ ప్రజల్లో ఎంతమేరకు వెళ్లిందనేదే ఇప్పుడు చర్చ.