బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (16:06 IST)

నెయ్యి, బియ్యపు పిండితో పనియారాలు ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 కప్పు బెల్లం - అరకప్పు యాలకులపొడి - చిటికెడు కొబ్బరిముక్కలు (చిన్నవి) - ఒక స్పూన్ గోధుమపిండి - 2 స్పూన్స్ అరటిపండు గుజ్జు - అరకప్పు నూనె లేదా నెయ్యి - సరిపడా తయారీ

కావలసిన పదార్థాలు:
బియ్యం - 1 కప్పు 
బెల్లం -  అరకప్పు 
యాలకులపొడి - చిటికెడు 
కొబ్బరిముక్కలు (చిన్నవి) - ఒక స్పూన్ 
గోధుమపిండి - 2 స్పూన్స్
అరటిపండు గుజ్జు - అరకప్పు 
నూనె లేదా నెయ్యి - సరిపడా
 
తయారీవిధానం
ముందుగా బియ్నాన్ని బాగా కడిగి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. తరువాత బియ్యాన్ని బ్లెండర్‌లో వేసి పిండిలా పట్టుకోవాలి. ఈ పిండిలో బెల్లం తరుగును వేసి మెత్తటి పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో యాలకుల పొడి, కొబ్బరిముక్కలు, గోధుమపిండి, అరటిపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పనియరాం ప్యాన్‌ని తీసుకుని ఒక్కో గుంటలో ఒక్కో స్పూన్ నెయ్యి వేయాలి. ఆ గుంటల్లో గరిటెడు పిండి వేసి సన్నని మంటై ఉడికించుకోవాలి. ఒక వైపు ఉడికిన తరువాత మరోసారి రెండో వైపుకు తిప్పి మరికాసేపు ఉడికించిన తరువాత దింపేయాలి. అంతే నెయ్యి పనియారాలు రెడీ.