1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 1 జులై 2019 (18:45 IST)

ఆకలిని తగ్గించడం కోసం ఏవి పడితే అవి తినకండి..

ఆకలిని తీర్చుకునేందుకు సమయానికి ఏదో ఒకటి తింటుంటారు చాలా మంది. ఆలా ఏదిపడితే అది తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. కొన్ని సందర్భాల్లో రోగాల బారిన పడే అవకాశం ఉంది.


అత్యవసర పరిస్థితుల్లో రాగులు, జొన్నలు, సబ్జాలు, కొర్రలు వంటి పదార్థాలను తరచుగా తీసుకోవడం వలన మధుమేహం, అధిక బరువు, రక్తపోటు, ఊబకాయం, గుండె వ్యాధులు వంటి సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
జొన్నల్లో క్యాల్షియం, ప్రోటీన్స్, పీచు పదార్థం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తాయి. సబ్జా గింజల నీరు శరీరానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. దాహం తీర్చడంతో పాటు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూస్తుంది. 
 
అధిక బరువును తగ్గించేందుకు ఈ నీరు చక్కగా పనిచేస్తాయి. ఈ సబ్జా నీరు శరీరంలో కొవ్వును కరిగించుటకు చక్కగా పనిచేస్తుంది. రాగుల్లో ఐరన్, పాస్పరస్, క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుటకు రాగులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఆకలి నియంత్రణకు మంచిగా ఉపయోగపడుతాయి.