శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 జులై 2018 (18:01 IST)

నిలబడి నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా? (Video)

"పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న" అని మన పెద్దలు అపుడపుడూ చెబుతుంటారు. కానీ, నిలబడి నీళ్లు తాగడం కూడా ప్రమాదేనంటున్నారు ఆయుర్వేద శాస్త్రవేత్తలు. మనిషి మనుగడ సాగించాలంటే నీళ్లు తప్

"పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న" అని మన పెద్దలు అపుడపుడూ చెబుతుంటారు. కానీ, నిలబడి నీళ్లు తాగడం కూడా ప్రమాదేనంటున్నారు ఆయుర్వేద శాస్త్రవేత్తలు. మనిషి మనుగడ సాగించాలంటే నీళ్లు తప్పనిసరి. దాహం వేసినపుడల్లా నీరు తాగాల్సిందే. అయితే, ఆ నీరు తాగే పద్ధతిలో తాగితేనే ఆరోగ్యానికి మంచిదని, ఎలా పడితే అలా తాగితే రోగాల బారినపడే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
* సాధారణంగా మనిషి శరీరంలో 60 శాతం నీళ్లే ఉంటాయి. అయితే, రోజువారి దినచర్యల వల్ల ఈ నీటి శాతం క్రమంగా తగ్గిపోతుంది. ఆ సమయంలో నీళ్లు తాగాలన్న సందేశాన్ని మెదడు అందిస్తుంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా గటగటా నీరు తాగేస్తాం. 
 
* అలా నీరు తాగే సమయంలో మనం కూర్చొని ఉన్నామా? నిలుచొని ఉన్నామా? అనేది పట్టించుకోం. అయితే, నిల్చొని నీళ్లు తాగడం వల్ల రోగాల బారిన పడతామని, కూర్చొని తాగితేనే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
* నిల్చుని నీళ్లు తాగడం వల్ల మనం తాగే నీళ్లు ఎక్కువ వేగంతో అన్నవాహికలోకి వెళ్లి, పొత్తి కడుపులో భాగంలో బలంగా తాకుతుందట. పలు సందర్భాల్లో అలాగే తాగుతూ ఉంటే పొత్తి కడుపు గాయాలపాలై, పక్కనున్న అవయవాలు కూడా ప్రభావితమవుతాయట. 
 
* భవిష్యత్తులో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, కిడ్నీ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
* ముఖ్యంగా, నిలబడి తాగడం వల్ల నీళ్లు అతి వేగంగా కిడ్నీల గుండా వెళ్తాయి. వడపోత సరిగా జరగదు. దాంతో మలినాలు రక్తంలో కలిసి రోగాలకు దారి తీస్తుందనీ, కిడ్నీల పనితీరు కూడా చెడిపోతుందని వారు వివరిస్తున్నారు. 
 
* మరీముఖ్యంగా కీళ్ల వద్ద ఉండే ద్రవాలు సంతులనం కోల్పోతాయని, దాంతో కీళ్లవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంత మేరకు కూర్చొని నీళ్లుతాగాని వారు సలహా ఇస్తున్నారు.