వారానికి 2 సార్లు చేపలు తింటే... కంటి చూపు సురక్షితం
చాలామంది డయాబెటిక్ రెటినోపతి సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటివారు వారానికి రెండుసార్లు చేపలు ఆరగించడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.
చాలామంది డయాబెటిక్ రెటినోపతి సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటివారు వారానికి రెండుసార్లు చేపలు ఆరగించడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.
ఇదే అంశంపై బార్సిలోనాలోని లిపిడ్ క్లినిక్ పరిశోధకులు ఓ పరిశోధన జరిపారు. వారానికి రెండుసార్లు ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలను తింటే చాలు.. ఈ ముప్పు 48 శాతం తగ్గుతుందని చెబుతున్నారు.
స్పెయిన్లో 2003-2009 వరకూ 55-80 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 3,614 మంది టైప్2 డయాబెటిస్ రోగులపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు.
సాధారణంగా మన కంటిలోని రె టీనాలో ఒమెగా-3 పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. మధుమేహం వల్ల రెటీనా దెబ్బతినకుండా ఈ కొవ్వు ఆమ్లాలు కాపాడతాయని పరిశోధనలో తేలింది.