శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (16:37 IST)

వేడినీటిలో వెల్లుల్లి రసం కలుపుకుని తాగుతుంటే...?

ఉబ్బసం సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కుంకుడు గింజలోని పప్పు ప్రతిరోజూ సేవిస్తుంటే ఉబ్బసం తగ్గిపోతుంది. వేడినీటిలో వెల్లుల్లి రసం కలుపుకుని తాగుతుంటే ఉబ్బసం తగ్గుతుంది. చక్కరకేళి అరటిపండును కొంచెం గోమూత్రంతో కలిపి తాగితే ఉబ్బసం వెంటనే నయమవుతుంది.
 
ఉబ్బస వ్యాధితో బాధపడేవారు తరచు శీతనపానీయాలు, స్వీట్లు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందాలంటే.. రోజూ కప్పు నీటిలో కొద్దిగా ధనియాల పొడి, బెల్లం కలిపి తీసుకుంటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. 
 
ఈ వ్యాధి చిన్నా పెద్దా అనే తేడాలేకుండా ఎవరు పడితే వారికి వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. రోజువారి ఆహారంలో కొద్దిగా అల్లం ముక్కను వేసి తీసుకున్నట్లైతే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
టీ తాగితే కూడా ఉబ్బసం రాకుండా ఉంటుంది. ఇక.. ఎక్కిళ్లు కూడా ఒక్కసోరి ఇబ్బంది పెడుతుంటాయి. అవి తగ్గేందుకు చిటాలు.. పసుపుతో చేసిన కుంకుమలో వేడిచేసిన ఆముదం కలిగి నాలుకకు రాసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి. వెలగాకు రసం, తేనె కలిపి సేవించినట్లయితే ఎక్కిళ్లు ఆగిపోతాయి. తేనెలో శొంఠి పొడిని కలిపి సేవిస్తే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.