శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : బుధవారం, 13 జనవరి 2016 (12:08 IST)

చర్మాన్నిమిలమిల మెరిపించే ఆరెంజ్

చలికాలంలో కొందరికి చర్మం తెల్ల తెల్లగా పొడిబారినట్లు ఉంటుంది. కొందరు సహజంగానే పొడిబారిన చర్మం కలిగివుంటారు. ముఖంపైన చలి ఎక్కువ ప్రభావం చూపుట వలన వారు ఒక రకమైన ఇబ్బందికి గురువుతారు. అలాంటి వారికి కొన్ని చిట్కాలు...
 
సహజంగా చలి వల్ల కలిగే ఈ రకమైన సమస్యను తగ్గించేందుకు ఎక్కువశాతం నీరు తాగుతారు. ఇదీ ఒక రకంగా ఉపయోగపడుతుంది. అయితే ఆరంజ్, తేనె వాడినట్లైతే ఈ సమస్యపైన ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
 
ఆరంజ్ పండ్లను తినేసి తొక్కలను బయట విసిరివేయకుండా, వాటిని ఎండలో ఎండబెట్టి పౌడర్‌గా చేసుకోవాలి. ఆ పౌడర్‌ని నీటిలో కలిపి ముఖానికి మరియు చేతులకు రాసుకొని కొద్దిసేపు తర్వాత శుభ్రం చేసుకుంటే పొడిబారిన చర్మం ఇట్టే మాయమైపోతుంది.
 
అదేవిధంగా అర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక గ్లాసు వేడి నీటిని, ఒకటి టీ స్పూన్ తేనె కలిపి ఉదయం పరగడుపుతో తాగినట్లైతే చర్మం నిగనిగలాడుతుంది. అంతేకాక శరీరంలో వున్న క్రొవ్వు పదార్థాలు తగ్గి నాజూకుగా తయారవుతారు. 
 
జిడ్డు చర్మం వున్నవారు రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ముఖానికి రాసినట్లైతే చర్మం మెరిసిపోతుంది. ఎ మరియు సి విటమిన్లు ఎక్కువగా కలిగివున్న పండ్లను ప్రతిరోజు తీసుకుంటే చర్మం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా మారుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.  
 
నల్లమచ్చలతో బాధపడేవారు టమోటో గుజ్జుతో పాటు పెరుగు కలిపిన మిశ్రమాన్నిముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకుంటే మచ్చలు తొలగిపోతుంది. మొక్కజొన్న పిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు శరీరానికి అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రపరచినట్లైతే శరీరం మిలమిలలాడుతుంది.