శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 10 మార్చి 2018 (20:55 IST)

అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో తెలుసా?

ప్రస్తుత కాలంలో ఎక్కువుగా ఉన్న సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు సమస్య వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు ఎక్కువుగా వస్తున్నాయి. ఈ అధిక బరువు తగ్గించడమే కాక ఒంట్లో వున్న వేడి, వ్యర్థాలను తొలగించే చ

ప్రస్తుత కాలంలో ఎక్కువుగా ఉన్న సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు సమస్య వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు ఎక్కువుగా వస్తున్నాయి. ఈ అధిక బరువు తగ్గించడమే కాక ఒంట్లో వున్న వేడి, వ్యర్థాలను తొలగించే చిట్కా ఒకటి ఉంది. అదేంటంటే అధికబరువుతో వచ్చే ముప్పు, సమస్యలు దూరమైపోయి యంగ్‌గా యాక్టివ్‌గా ఉంటారు.
 
1. మనం ఇంట్లో వాడే సగ్గుబియ్యమే చక్కటి పరిష్కారం. సగ్గుబియ్యం మనం తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య తొలగిపోతుంది. ఎప్పుడైతే మలబద్దక సమస్య తొలగిపోవడం, మలవిసర్జన సాఫీగా జరగటం లాంటివి జరుగుతాయో శరీరంలో ఉన్న టాక్సిన్లు అన్ని వెళ్లిపోతాయి. అయితే చాలామంది ఉదయం పూట మలవిసర్జన ఫ్రీగా అయిపోతుంది అనుకుంటారు. కానీ శరీరం లోని వ్యర్థ పదార్ధాలు కొన్ని అలానే ఉంటాయి. వాటివల్ల బరువు పెరగటం, లావు అవ్వటం, వెంట్రుకలు వూడిపోవటం లాంటివి జరుగుతాయి.
 
దీనికి ఏంచేయాలి అంటే రోజు ఉదయం పూట సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం ఒక గంట సేపు నీళ్లలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక గ్లాసు నీరు తీసుకొని దానిలో సగ్గుబియ్యం వేసి బాగా ఉడికించాలి. మెత్తగా ఉడికిన తర్వాత దానిలో ఒక గ్లాసు పాలుపోసి 10 గ్రాముల బెల్లం ముక్క వేయాలి. దీనిని నిత్యం ఉదయాన్నే టిఫిన్‌కు బదులుగా తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు.