శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: గురువారం, 23 మార్చి 2017 (18:08 IST)

వారానికి ఒకసారి పసుపు వేసిన నీటిని తాగితే....?

పసుపు ఎన్నో ఔషధాల్లో ఉపయోగిస్తుంటారు. పసుపును ఆహార పదార్థాలలోనూ వాడుతుంటాం. పసుపుకు సంబంధించిన కొన్ని ఉపయోగాలు...ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యం కూడా పెరుగుతుంది.

పసుపు ఎన్నో ఔషధాల్లో ఉపయోగిస్తుంటారు. పసుపును ఆహార పదార్థాలలోనూ వాడుతుంటాం. పసుపుకు సంబంధించిన కొన్ని ఉపయోగాలు...ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యం కూడా పెరుగుతుంది.
 
ఎక్కువసేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్లు, లేక ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటపుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వలన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.
 
ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పది నిముషాల తర్వాత సబ్బుతో రుద్దుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి. శరీరం మీద ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు, వేపాకుని నూరి ఒంటికి పూస్తే దురద తగ్గిపోతుంది.