థాయ్లాండ్లో నడిరోడ్డుపై 25 మంది సజీవదహనం
థాయ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోన్బురి ఫ్రావిన్స్, బన్బుంగ్ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది.
థాయ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోన్బురి ఫ్రావిన్స్, బన్బుంగ్ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే 25 మంది సజీవదహనమయ్యారు.
ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్నవారిలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు డ్రైవర్లు సహా 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని బన్బుంగ్ జిల్లా పోలీసు అధికారి కల్నల్ దుసాదీ మీడియాకు తెలిపారు. ‘అసలు ఇలాంటి ప్రమాదం జరగాల్సిందికాదు. కానీ జరిగిపోయింది’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.