బ్రష్ చేసుకోనని మారాం చేసిన కన్నబిడ్డను హత్య చేసిన కసాయి తల్లి
బ్రష్ చేసుకోనని మారం చేసిన కన్నబిడ్డను హత్య చేసిందో కసాయి తల్లి. ఈ దారుణం అమెరికాలో జగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అమెరికాలోని మేరిల్యాండ్లో గల గైటర్స్ బర్గ్లో ఇరవై ఏళ్ల
బ్రష్ చేసుకోనని మారం చేసిన కన్నబిడ్డను హత్య చేసిందో కసాయి తల్లి. ఈ దారుణం అమెరికాలో జగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అమెరికాలోని మేరిల్యాండ్లో గల గైటర్స్ బర్గ్లో ఇరవై ఏళ్ల హెర్నాడ్జ్ రైవస్ తన కుమార్తె బాత్రూంలో అచేతనంగా పడిపోయిందని అత్యవసర సేవలకు నెంబర్ 911కు ఫోన్ చేసింది.
తన కుమార్తె స్నానం చేయటానికి బాత్రూంలోకి వెళ్లిన 15 నిమిషాలకు పడిపోయి టబ్కు తలకొట్టుకుందని అధికారులకు చెప్పింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె ఒంటిపై పలు గాయాలు ఉన్న విషయాన్ని గుర్తించారు. తలకు తగిలిన గాయం తీవ్రంగా ఉండటంతో ది చిల్డ్రన్స్ నేషనల్ మెడికల్ సెంటర్కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. దీంతో పోలీసులు హెర్నాడ్జ్ను తమదైనశైలిలో విచారించగా నిజం బయటపెట్టింది. తన కాలుతో చిన్నారి కడుపులో కొట్టడంతో ఆ బాలిక గోడను కొట్టుకొని పడిపోయినట్లు వెల్లడించింది. బ్రష్ చేసుకోని కారణంగానే తాను కొట్టినట్లు ఆమె పేర్కొంది. దీంతో పోలీసులు ఆమెపై అభియోగాలు మోపి జైలుకు తరలించారు.