శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (11:49 IST)

ఆ కొండ చిలువతో మసాజ్ చేయించుకుంటే ఒళ్లు నొప్పులు మటాష్...

ఎవరైనా ఒళ్లు నొప్పులు, మెడ నొప్పి వంటివి వస్తే మసాజ్ చేయించుకుంటారు. మరికొందరు ఎంజాయ్‌మెంట్ కోసం అమ్మాయిలతో ఆ పని చేయించుకుంటారు. కానీ, జర్మనీకి చెందిన ఓ వ్యక్తి తన వద్దకు వచ్చే కస్టమర్లకు ఏకంగా కొండ

ఎవరైనా ఒళ్లు నొప్పులు, మెడ నొప్పి వంటివి వస్తే మసాజ్ చేయించుకుంటారు. మరికొందరు ఎంజాయ్‌మెంట్ కోసం అమ్మాయిలతో ఆ పని చేయించుకుంటారు. కానీ, జర్మనీకి చెందిన ఓ వ్యక్తి తన వద్దకు వచ్చే కస్టమర్లకు ఏకంగా కొండ చిలువతో మసాజ్ చేయిస్తున్నారు. వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ.. ఇది పచ్చినిజం. అదేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ డొహ్లన్‌ స్థానికంగా హెయిర్‌ సెలూన్‌ నడుపుతున్నాడు. 13 సంవత్సరాల క్రితం ఓ రోజు పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఓ పాము పిల్ల కనిపించింది. సాధారణంగా వేరే వాళ్లయితే వెంటనే చంపేస్తారు. ఫ్రాంక్‌ మాత్రం దానిని జాగ్రత్తగా పెంచాడు. ఆ పాముకు మాంటీ అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత తన వెంట ఆ పానును కూడా షాపుకు తీసుకెళుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో కొంతకాలానికి అతడికి ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే... ప్రతి రోజూ తాను చేస్తున్న పనిని మాంటీతో చేయిస్తే ఎలా ఉంటుంద‌ని అనుకున్నాడు. అంతే వెంటనే ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ప్రారంభంలో కాస్త జంకినా, తర్వాత స్పందన బాగానే లభించింది. 
 
మాంటీ మెడకే కాకుండా ఒళ్లు నొప్పులకీ మసాజ్‌ చేస్తుంది. మాంటీ శరీరానికి చుట్టుకొని గట్టిగా అదుముతూ మసాజ్ చేస్తుంది. అయితే, ఈ కొండ చిలువ మసాజ్ చేసినందుకు ఫ్రాంక్ పైసా తీసుకోడు. కానీ, దాని ఆహారానికి మాత్రం ఇచ్చినంత విరాళం తీసుకుంటాడు.