శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: శనివారం, 28 మార్చి 2015 (08:37 IST)

బంగ్లాదేశ్ ఆలయంలో తొక్కిసలాట... 10 మంది మృతి

బంగ్లాదేశ్ లోని ఓ హిందూ దేవాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలో అధికంగా ఉన్నారు. శుక్రవారం బంగ్లాదేశ్ లాంగ్లాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
బంగ్లాదేశ్ లోని హిందువుల పవిత్ర పుణ్యస్థలం లాంగ్లాబాద్ ప్రాంతంలోని లంగల్ బంద్ దేవాలయానికి వేలాదిమంది భక్తులు  పోటెత్తారు. అయితే అక్కడ అన్ని ఏర్పాట్లు లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ తొక్కిసలాటలో 10 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. రాజధాని ఢాకా సమీపంలో పాత బ్రహ్మపుత్ర  నదీతీరంలో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
చనిపోయిన వారంతా యాభైఏళ్లు పైబడినవారని తెలుస్తోంది. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు.  ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో బంగ్లాదేశీయులతో పొరుగు దేశీయులైన భారతీయులు, నేపాలీయులు కూడా  పుణ్యస్నానాలు చేస్తారు. దుర్ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.