శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (17:58 IST)

'పద్మ భూషణ్' ఎంపికకు బిల్ గేట్స్ దంపతుల ధన్యవాదాలు

భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం 'పద్మభూషణ్'ను ప్రకటించడం పట్ల బిల్ గేట్స్, మిలిందా గేట్స్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో సమాజ సేవకుగానూ పలువురు ప్రముఖ వ్యక్తులతో పాటు 'పద్మ' అవార్డు తీసుకోబోతుండటం చాలా గర్వంగా భావిస్తున్నట్టు తెలిపారు.  భారత్ వృద్ధి దిశగా కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు.
 
ఇంతటి అత్యున్నత పురస్కారానికి తమను ఎంపికచేసిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలువురికి పుద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.