శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2016 (14:50 IST)

టర్కీలో 13 మంది సైనికుల మృతి.. 48 మందికి గాయాలు...

టర్కీ మరోమారు బాంబు పేలుళ్ళతో ఉలిక్కిపడింది. టర్కీ సైనిక సిబ్బందిని తీసుకువెళ్తున్న బస్సును పేలుడు పదార్థాలు ఉన్న కారు ఢీ కొట్టడంతో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 48

టర్కీ మరోమారు బాంబు పేలుళ్ళతో ఉలిక్కిపడింది. టర్కీ సైనిక సిబ్బందిని తీసుకువెళ్తున్న బస్సును పేలుడు పదార్థాలు ఉన్న కారు ఢీ కొట్టడంతో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 48 మంది గాయపడినట్లు టర్కీ సైన్యం వెల్లడించింది. క్యాసేరిలోని ఎరసైయెస్‌ యూనివర్సిటీ సమీపంలో ఈ ఘటన జరిగింది. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు ధాటికి బస్సు పూర్తిగా ధ్వంసమైంది. సైనికులను తీసుకెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈ కారు బాంబు దాడికి పాల్పడినట్లు టర్కీ ఉప ప్రధాని వెసి క్యానక్‌ తెలిపారు. కాగా, గతవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో కుర్దిష్‌ మిలిటెంట్లు జరిపిన దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.