బతికున్నప్పుడే అంత్యక్రియలు చేసుకున్న వృద్ధ దంపతులు...
బతికున్నప్పుడు బర్త్డే పార్టీ, వీడ్కోలు పార్టీ, పెళ్ళి పార్టీలు చేసుకోవడం మనకు తెలిసిందే గాని అంత్యక్రియల పార్టీల గురించి ఎప్పుడైనా వినున్నారా...అవును వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ పార్టీని బోస్నియాకి
బతికున్నప్పుడు బర్త్డే పార్టీ, వీడ్కోలు పార్టీ, పెళ్ళి పార్టీలు చేసుకోవడం మనకు తెలిసిందేగానీ అంత్యక్రియల పార్టీల గురించి ఎప్పుడైనా వినున్నారా...! అవును వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఈ తరహా పార్టీ బోస్నియాకి చెందిన వృద్ధ దంపతులు చేసుకున్నారు. ఆ వివరాలను పరిశీలిస్తే... బోస్నియాలో డ్రాగన్ మారిక్, డ్రాజికా అనే వృద్ధ దంపతులున్నారు.
ఈ దంపతులకు సంతానం లేరు. సాధారణంగా తల్లి దండ్రులు చనిపోయాక అంత్యక్రియలు జరపడానికి పుత్రులుంటారు. కానీ ఈ దంపతులకి తలకొరివి పెట్టడానికి ఎవరూ లేకపోవడంతో బతికుండగానే బంధువుల సమక్షంలో అంత్యక్రియల పార్టీని జరుపుకున్నారు. పోజేజ్డినా గ్రామంలోని ఓ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించి దాదాపు 200 మంది బంధువులు, మిత్రులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా జరిపారు.
అంత్యక్రియల కార్యక్రమం పూర్తయ్యాక భోజనాల తంతు కూడా పూర్తి చేశారు. తమ అంత్యక్రియలు చేయడానికి పిల్లలు లేరని, అందుకే ముందే ఆ తతంగాన్ని బంధుమిత్రుల మధ్య నిర్వహించుకున్నామని ఈ వృద్ధ దంపతులు చెప్పడం అందరి మనసుల్ని కదిలించేసింది.