శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 జులై 2017 (12:59 IST)

ఒకే రోజు.. ఇద్దరు కామాంధుల చేతిలో నలిగిపోయిన బాలిక.. రైలులో, కారులో?

బ్రిటన్‌లో 15 ఏళ్ల బాలిక ఒకే రోజు ఇద్దరి చేతులో అత్యాచారానికి గురైంది. రైలులో, కారులో వేర్వేరు వ్యక్తుల చేతిలో 15 ఏళ్ల బాలిక నలిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్, బర్మింగ్‌హామ్‌లోని విట్టాన్ రైల

బ్రిటన్‌లో 15 ఏళ్ల బాలిక ఒకే రోజు ఇద్దరి చేతులో అత్యాచారానికి గురైంది. రైలులో, కారులో వేర్వేరు వ్యక్తుల చేతిలో 15 ఏళ్ల బాలిక నలిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్, బర్మింగ్‌హామ్‌లోని విట్టాన్ రైల్వే స్టేషన్లో 15 ఏళ్ల బాలిక తన స్నేహితురాలితో వెళ్తుండగా ఓ వ్యక్తి బాలిక వెంట పడ్డాడు. ఉన్నట్టుండి ఆ బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు.. రైలులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అత్యాచారానికి గురైన బాలిక.. అతని నుంచి తప్పించుకుని రైల్వే స్టేషన్ నుంచి ఆ మార్గం ద్వారా వెళ్తున్న కారును లిఫ్టు కోరింది. ఇలా ఆ బాలికకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కూడా కారులోనే ఆమెను రేప్ చేశాడు. ఇలా ఒకే రోజున రెండు సార్లు కామాంధులకు బలైన చిన్నారి ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కామాంధుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.