శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (12:47 IST)

రోబోలను చంద్రుడిపైకి పంపండి.. రూ.136 కోట్లు గెలుచుకోండి.. పోటీలో ఇండస్...

రోబోల అభివృద్ధికి ఇంజనీర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశోధకులను ప్రోత్సహించేందుకు రూ.205 కోట్లు గూగూల్‌ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌, గూగుల్‌, ఎక్స్‌ప్రైజ్‌ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. కేవలం ప్రైవే

రోబోల అభివృద్ధికి ఇంజనీర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశోధకులను ప్రోత్సహించేందుకు రూ.205 కోట్లు గూగూల్‌ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌, గూగుల్‌, ఎక్స్‌ప్రైజ్‌ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. కేవలం ప్రైవేటు వ్యక్తులు, సంస్థలే ఈ బహుమతికి అర్హులని ప్రకటించాయి. అయితే ఈ బహుమానాన్ని గెలుచుకోవాలంటే.. స్వయంగా తయారు చేసిన అంతరిక్ష నౌకను చంద్రుడిపైకి పంపాలి.
 
భారత్‌ నుంచి ‘టీం ఇండస్‌’‌ అనే కంపెనీ మాత్రమే ఈ పోటీలో పాల్గొంటోంది. ఈ నౌకను చంద్రుడిపై 500 మీటర్లు ప్రయాణింప చేయాలని గూగుల్ లునార్ తెలిపింది. తర్వాత దీని ద్వారా చంద్రుడి హైడెఫినేషన్‌ వీడియో, ఫొటోలను భూమికి చేర్చాలి. ఈ పోటీలో పాల్గొనే వారు మిషన్‌ మొత్తం ఖర్చులో 10 శాతానికి మించి ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోకూడదని వెల్లడించింది. 
 
90 శాతం నిధులు ప్రైవేటు సంస్థల నుంచే సమకూర్చుకోవాలి. పోటీలో పాల్గొనాలంటే డిసెంబరు 31, 2016 కల్లా నమోదు చేసుకోవాలి. 2017 చివరి నాటికి ఈ మిషన్‌ పూర్తి చేయాలి. మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే.. మొదటి బహుమతి కింద 2 కోట్ల డాలర్లు( రూ.136 కోట్లు), రెండో బహుమతి కింద 50 లక్షల డాలర్లు (రూ.34 కోట్లు), బోనస్‌ బహుమతి కింద 50 లక్షల డాలర్లు ఇవ్వనున్నారు.