శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (19:00 IST)

లిబియాలో ఉగ్ర పంజా..? కాల్పుల్లో 8 మంది మృతి!?

లిబియా కేపిటల్ సిటీ ట్రిపులోని లగ్జరీ కొరింతియా హోటల్ వద్ద కొందరు దుండగులు మంగళవారం దాడికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారని ఓ భద్రతా అధికారి తెలిపారు. హోటల్లోని కొందర్ని దుండగులు బందీలుగా తీసుకున్నట్లు చెప్పారు. ఐదుగురు విదేశీయులు కూడా ఆ దాడిలో మరణించినట్లు సమాచారం. 
 
కారు బాంబును ఉగ్రవాదులు పేల్చినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన తర్వాత కారు బాంబు పేలినట్లు చెబుతున్నారు. ఆయుధాలు పట్టుకుని ముఖానికి మాస్కులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి వచ్చిన ఐదుగురు దుండగులు, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
 
హోటల్ ముందు కాల్పులు జరుగుతుండటంతో హోటల్లోని కొందరు విదేశీ పర్యాటకులు హోటల్ వెనకవైపు నుంచి పారిపోయినట్లు అధికారులు చెప్పారు.