శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (15:56 IST)

ఇండోనేషియా ఫ్లైట్‌కు బాంబు బూచి.. అత్యవసర ల్యాండింగ్..!

ఇటీవల విమాన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా ఇండోనేషియాలో ఒక విమానానికి పెను ముప్పు తప్పింది. దీంతో అందులో ఉన్న 125 మంది ప్రయాణీకులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం గురించి ఇండోనేషియా రవాణా అధికార ప్రతినిధి జేఏ బరతా తెలుపుతూ..  విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శుక్రవారం ఉదయం అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు తెలిపారు. 
 
ఇండోనేషియాలో అతి తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని కల్పించే అతి పెద్ద విమానయాన సంస్థ బటిక్ ఎయిర్ ప్లేన్. ఆ సంస్థ విమానానికి టెక్స్ రూపంలో బెదిరింపు సందేశం వచ్చిందని, దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశామన్నారు. 
 
అనంతరం బాంబు తనఖీ బృందం విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి బాంబులేదని లేదని తేల్చినట్టు తెలిపారు. అది తప్పుడు ఫోన్ కాల్ అని తేలిందని పోలీసులు చెప్పారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ బెదిరింపు కారణంగా కొన్ని గంటల పాటు ఆలస్యంగా ఆ విమాన్ని మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించిందని అధికారులు వెల్లడించారు.