శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (10:38 IST)

జిహాదీగా మారిన జోర్డాన్ ఎంపీ తనయుడు.. ఆత్మాహుతి దాడిలో మృతి!

జిహాదీగా మారిన జోర్డాన్ ఎంపీ తనయుడు ఒకరు ఆత్మాహుతిదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ఇటీవలికాలంలో మధ్య ఆసియాలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం నానాటికీ హెచ్చురిల్లి పోతున్న విషయంతెల్సిందే. ఈ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులపై పోరాటం జరుపుతున్న అంతర్జాతీయ కూటమిలో జోర్డాన్ కూడా ఉంది. 
 
అయితే, జోర్డాన్ పార్లమెంట్ సభ్యుడైన మాజెన్ దలయీన్ కొడుకు మొహమ్మద్ దలయీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదవాలని వెళ్లి, ఇసిస్ ఉగ్రవాదుల ఆకర్షణకులోనై జిహాదీగా మారిపోయాడు. దాంతో జిహాదీగా మారిన మొహమ్మద్ టర్కీ సిరియాల మీదుగా ఇరాక్ చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతనిని తీవ్రవాద మార్గం నుంచి తప్పించేందుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది.
 
ఈ పరిస్థితుల్లో ముగ్గురు సభ్యుల ఆత్మాహుతి బృందంతో కలిసి ఓ ఇరాకీ సైనిక శిబిరంపై దాడిలో పాల్గొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని జోర్డాన్ ఎంపీ కుటుంబ సభ్యులకు ఐఎస్ వెబ్‌సైట్ ద్వారా తెలియజేసింది. మరోవైపు.. బ్రిటన్‌లో 50 మంది జిహాదీ రిక్రూట్‌ల పాస్‌పోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వారంతా సిరియా, ఇరాక్ దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం అందడంతో అదికారులు ఈ చర్య తీసుకున్నారు.