గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 జనవరి 2018 (14:33 IST)

నా టేబుల్ మీద న్యూక్లియర్ బటన్ ఉంటుంది: కిమ్ జాంగ్

ప్రపంచ దేశాలను అణు పరీక్షలతో వణికిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కొత్త సంవత్సరాది శుభాకాంక్షలను కూడా తనదైన శైలిలోనే చెప్పారు. తన టేబుల్ మీద న్యూక్లియర్ బటన్ వుందని.. కిమ్ జాంగ్ అన్నారు. దా

ప్రపంచ దేశాలను అణు పరీక్షలతో వణికిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కొత్త సంవత్సరాది శుభాకాంక్షలను కూడా తనదైన శైలిలోనే చెప్పారు. తన టేబుల్ మీద న్యూక్లియర్ బటన్ వుందని.. కిమ్ జాంగ్ అన్నారు. దాన్ని నొక్కితే అణు బాంబు బయల్దేరుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ ఇలా చెప్పడం ద్వారా తాను బ్లాక్ మెయిల్ చేయట్లేదని.. ఇది నిజమైన విషయమని కిమ్ జాంగ్ వ్యాఖ్యానించారు.
 
ఉత్తర కొరియా అణ్వస్త్ర సంపద కలిగున్న దేశమేనంటూ ప్రపంచ దేశాలు జడుసుకుంటున్న నేపథ్యంలో గత కొంతకాలంగా ఉత్తర కొరియాపై ఆంక్షలను అమలు చేస్తున్నప్పటికీ, వాటిని కిమ్ జాంగ్ బేఖాతరు చేస్తున్నారు. అంతేగాకుండా అణు పరీక్షలను కూడా కొనసాగిస్తున్నారు. కిమ్‌ను కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం మాత్రం శూన్యం. తాజాగా కిమ్ టేబుల్ మీద న్యూక్లియర్ బటన్ వుందని.. దాన్ని నొక్కితే అణుబాంబు బయల్దేరుతుందని చెప్పడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
ఇదిలా ఉంటే ఉత్తర కొరియాపై యూఎస్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మాజీ ఛైర్మన్‌ మైక్‌ ముల్లెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఉత్తరకొరియాతో త‌మ దేశం యుద్ధానికి దగ్గరవుతోందని ఆందోళన వ్యక్తం చేశఆరు. ఇరుదేశాల‌ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించే అవకాశం ఉందని తాను భావించట్లేదని ఆయన చెప్పారు.