ముగిసిన సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ అంత్యక్రియలు!
సింగపూర్ వ్యవస్థాపక నాయకుడు, మాజీ ప్రధాని లీ క్వాన్ యూ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. కొన్ని రోజులుగా పార్లమెంటు భవనంలో సందర్శనార్థం ఉంచిన ఆయన భౌతికకాయాన్ని ఆదివారం వెలుపలకు తీసుకొచ్చారు. ఈ సమయంలో క్వాన్కు తుది వీడ్కోలు పలికేందుకు వేలాదిమంది ప్రజలకు అక్కడికి చేరుకున్నారు.
అంతిమయాత్రతో వెళుతున్న ఆయనకు 'గుడ్ బై మై డియర్ లీ' అంటూ వీడ్కోలు పలికారు. తర్వాత భారీ భద్రత బలగాలు పరేడ్ నిర్వహించాయి. తుపాకీలతో గాల్లోకి పేల్చి లీకు గౌరవ వందనం సమర్పించాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఇతర దేశాల ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు.