శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (12:19 IST)

తిరిగి రాడనుకున్న కేరళ వ్యక్తి.. 40 ఏళ్ల తర్వాత దుబాయ్‌లో ప్రత్యక్షం..

ఇక ఎప్పటికీ తిరిగిరాడనుకున్న కేరళ వ్యక్తి 40 ఏళ్ల తర్వాత దుబాయ్‌లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచాడు. వివరాల్లోకి వెళితే..  కేరళకు చెందిన అబ్దుల్లా పునాతిల్ ఉస్మాన్ 1970లో ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడ కుక్గా పనిలో కుదిరి, ఆ తర్వాత ఎప్పుడూ సొంతూరుకు రాలేదు. 
 
అయితే ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు 40 ఏళ్లుగా గాలిస్తున్నారు. మీడియా, స్నేహితుల సాయంతో కూడా ప్రయత్నించి చూశారు. ఇక లాభంలేదనుకుని ఆశలు వదిలేసుకునే సమయంలో దుబాయ్లోని ఓ ఆస్పత్రిలో ఉస్మాన్ ఉన్నట్టు స్నేహితులు గుర్తించారు. 
 
తమ అనుబంధం గురించి చెబితే ఉస్మాన్ ఆశ్చర్యపోయాడు. ఇప్పటికే అదే ఉద్యోగం చేస్తూ ఒంటరి జీవితం గడుపుతున్నట్టు, రెండు నెలల క్రితం కాలిగాయంతో ఆస్పత్రిలో చేరినట్లు ఉస్మాన్ తెలిపాడు. ఉస్మాన్ను కేరళకు తీసుకువచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఉస్మాన్ కూడా సొంతూరు రావాలని ఆశతో ఎదురు చూస్తున్నట్లు సమాచారం.