శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (10:35 IST)

పఠాన్‌కోట్ తరహాలో మరిన్ని దాడులు.. భారత్‌కు హఫీజ్ సయీద్ హెచ్చరిక

పఠాన్‌కోట్ తరహా దాడులు మరిన్ని జరుపుతామని జైషే మొహమ్మద్ నేత హఫీజ్ సయీద్ మరోమారు హెచ్చరించాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... భారత్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా... తమను ఏం చేయలేదు కదా.. మరిన్ని దాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
 
కాగా, హఫీజ్ తాజా హెచ్చరికలతో భారత్, పాక్ మధ్య జరగాల్సిన చర్చలు మరింత ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయి. పఠాన్‌కోట్ దాడికి హఫీజ్ సూత్రధారి అని భారత్ తన దగ్గర ఉన్న ఆధారాలను పాకిస్థాన్‌కు అందజేసింది. కానీ పాకిస్థాన్ మాత్రం ఇప్పటి వరకు ఆ ఉగ్ర నేతను పట్టుకునే సాహసం చేయలేదు. టెర్రర్ గ్రూప్ జైషే మొహమ్మద్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసినా.. పాకిస్థాన్ మాత్రం హఫీజ్‌ను స్వేచ్ఛగా తిరగనిస్తూ ఉగ్రవాద నిర్మూలనపై పాకిస్థాన్ తన ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోంది.