శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (14:35 IST)

గుండె బరువెక్కింది: ఆ తెగ ప్రజల దయనీయ స్థితికి సజీవ దృశ్యం

అర్జెంటీనా దేశంలో నివశించే ఓ తెగ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చుక్క మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. ఈ తెగ ప్రజల వాస్తవ పరిస్థితిని యూనిసెఫ్ ఫోటో జర్నలిస్టు ఓ ఫోటో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేశాడ

అర్జెంటీనా దేశంలో నివశించే ఓ తెగ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చుక్క మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. ఈ తెగ ప్రజల వాస్తవ పరిస్థితిని యూనిసెఫ్ ఫోటో జర్నలిస్టు ఓ ఫోటో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటో ఇపుడు వైరల్ అయింది. ఈ ఫోటో గుండెలు పిండేస్తోంది. ఆ చిన్నారి దయనీయ పరిస్థితి చూస్తే హృదయం ద్రవించుకుని పోతోంది.

తాగడానికి నీళ్లు దొరక్క ఓ చిన్నారి నడిరోడ్డుపై పడ్డ నీళ్లను నాలుకతో చప్పరిస్తున్నాడు. ఈ పరిస్థితి అర్జెంటీనాలోని పొసడాస్ సిటీ సజీవ దృశ్యం. ఎండకు తాళలేక… దాహంతో ఇలా రోడ్డుపై పడ్డ నీళ్లను తాగుతోంది ఆ చిన్నారి. భిక్షాటనే వృత్తిగా బతుకుతున్న వీళ్లు.. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడి మేబా గరానీ తెగకు చెందిన ఈ చిన్నారిలాంటి వాళ్ల సంఖ్య వందల్లోనే ఉంటుందట. 
 
ఈ తెగ వృత్తే భిక్షాటనట. ఈ చిన్నారి ఫొటోను యూనిసెఫ్ వాలంటీర్ మాగ్యూ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిపడింది. అర్జెంటీనాలోని పేదరికంపై… అక్కడి ప్రభుత్వాల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క స్థానిక జర్నలిస్టులు… వాటర్ బాటిల్స్ పంచుతూ.. తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.