శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 23 మే 2017 (18:53 IST)

పాక్ శిబిరాలపై దాడి జరగలేదు... భారత్ అవాస్తవం చెప్తోంది... పాకిస్తాన్ జనరల్

నియంత్రణ రేఖ వెంబడి కుక్కల్లా దొంగచాటుగా చొరబడుతున్న ఉగ్రవాదులను ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20, 21వ తేదీల్లో వారి స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. రాకెట్ లాంఛర్లు, యాంటీ-ట్యా

నియంత్రణ రేఖ వెంబడి కుక్కల్లా దొంగచాటుగా చొరబడుతున్న ఉగ్రవాదులను ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20, 21వ తేదీల్లో వారి స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. రాకెట్ లాంఛర్లు, యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ వంటి ఆయుధాలను ప్రయోగించి వారిని మట్టుబెట్టినట్లు మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అశోక్ నరులా ప్రకటించారు.
 
ఐతే ఈ ప్రకటనను తోసిపుచ్చింది పాకిస్తాన్ సైనికాధికారి. పాక్ ఎల్వోసీ వెంట ఎలాంటి దాడులు జరుగలేదని తెలిపింది. భారత్ చేసేవన్నీ అసత్య ప్రచారమంటూ చెప్పుకొచ్చింది. పాకిస్థాన్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్లో స్పందిస్తూ, ఎల్‌వోసీ వెంట ఉన్న నౌషెరాలోని త‌మ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త్ చేస్తోన్న వ్యాఖ్య‌లు అంతా అస‌త్య‌మని కొట్టిపారేశారు. కాగా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపినపుడు కూడా ఇదే వాదన చేసింది పాకిస్తాన్.