శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 మే 2016 (10:09 IST)

మేం తలచుకుంటే ఢిల్లీని 5 నిమిషాల్లోనే లేకుండా చేస్తాం : పాకిస్థాన్ అణు శాస్త్రవేత్త

పాకిస్థాన్ అణు శాస్త్రవేత్త, ఆ దేశ అణు కార్యక్రమం రూపశిల్పి డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ప్రపంచ దేశాలను నివ్వెరపరిచే వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలు దుస్సాహసానికి పాల్పడే చర్యగా ఉన్నాయి. 
 
పాకిస్థాన్ తొలి అణు పరీక్ష ఆయన నేతృత్వంలో 1998లో జరిగింది. తొలి అణు పరీక్ష వార్షికోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ తలచుకుంటే భారత రాజధాని ఢిల్లీని కేవలం ఐదు నిమిషాల్లో టార్గెట్ చేయవచ్చన్నారు. 
 
పాకిస్థాన్‌లోని రావల్పిండికి సమీపంలోని కహుటా నుంచి దాడి చేయడానికి వీలవుతుందన్నారు. తమ దేశం 1984లోనే అణ్వాయుధాలను సంపాదించి ఉండేదని, కానీ అప్పటి దేశాధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్ అందుకు వ్యతిరేకించారని చెప్పారు.
 
కాగా, ఖాదిర్‌పై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. ఈయన అణు రహస్యాలను ఇరాన్, సిరియా, ఉత్తర కొరియా దేశాలకు అందజేశారనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్దిరోజుల పాటు గృహనిర్బంధాన్ని కూడా అనుభవించారు.