శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (16:20 IST)

యాక్.. థూ.. టాయిలెట్‌లో వేసిన అన్నం ముద్దలను తినేశారు... (Video)

సాధారణంగా మరుగుదొడ్డిపక్కన భోజనం చేయాలంటేనే వాంతులు చేసుకుంటారు. అలాంటిది ఏకంగా పురుషులు మూత్ర విసర్జన చేసే టాయ్‌లెట్‌లో అన్నం ముద్దలు వేసుకుని ఆరగించారు కొంతమంది సిబ్బంది.

సాధారణంగా మరుగుదొడ్డిపక్కన భోజనం చేయాలంటేనే వాంతులు చేసుకుంటారు. అలాంటిది ఏకంగా పురుషులు మూత్ర విసర్జన చేసే టాయ్‌లెట్‌లో అన్నం ముద్దలు వేసుకుని ఆరగించారు కొంతమంది సిబ్బంది. ఇలా ఎందుకు చేశారో తెలుసా.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకట. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను తెలుసుకుందాం.
 
తమ కంపెనీలో టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతామని.. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటామని కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. అంతేనా, కంపెనీ ఉద్యోగులకు టాయిలెట్ల శుభ్రతపై నమ్మకం కలిగించేందుకు, తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఓ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా, దాదాపు 20 మంది ఉద్యోగులు.. టాయిలెట్‌లో వేసిన అన్నం ముద్దలను ఆరగించారు. అంతేకాకుండా అదే టాయిలెట్ గదిలో డైనింగ్ టేబుల్ వేసుకుని భోజనం కూడా చేశారు. శుభ్రతపై తమకున్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించడానికి చైనా కంపెనీ ఈ పని చేసింది.