దావూద్ను సురక్షిత ప్రాంతానికి తరలింపుపై ఐఎస్ఐ యత్నం?
ఉత్తర వజిరిస్థాన్లోని పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో దాగి అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి అనువైన ప్రదేశంకోసం పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వెతుకుతోందని సమాచారం.
దావూద్ను ఇంతకు ముందు థాయలాండ్, నైరోబి, యుఏఈ, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు తరలించాలని అనుకున్న ఐఎస్ఐ ఆ ప్రయత్నాలను విరమించుకుందని, ఇప్పుడు దేశంలోనే సురక్షితమైన ప్రాంతానికి ఆయనను మార్చడానికి ఐఎస్ఐ ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా శనివారం ఓ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దావూద్ ఇబ్రహీం పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.