శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: బుధవారం, 28 జనవరి 2015 (06:46 IST)

ఒబామా పర్యటనపై వైట్ హస్ ఏమంది?

మీ ఆతిథ్యం మేము మరుపురానిది. ధన్యవాదాలు.. భారతీయులు పలికిన స్వాగతం తీరు మరింత ఆనందదాయకం అంటూ శ్వేత సౌథం స్పందించింది. ఒబామా పర్యటన పర్యటన ముగించుకుని దుబాయ్ బయలు దేరిన తరువాత  భారత్-అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్లిందని ప్రధాని నరేంద్రమోదీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. .

రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని ఆకాంక్షిస్తున్నా. మీ పర్యటనతో రెండుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి అని ఒబామాకు మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. .

వైట్‌హౌస్ కూడా దీనికి స్పందించింది. ఒబామా పర్యటనను ఎల్లకాలం గుర్తుండిపోయేలా చేసినందుకు ధన్యవాదాలు నరేంద్రమోదీ. ఆత్మీయ స్వాగతం పలికిన భారత ప్రజలకు కతజ్ఞతలు అంటూ అమెరికా అధ్యక్షుడి కార్యాలయం ట్విట్టర్ ద్వారా బదులిచ్చింది. .