శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2016 (17:53 IST)

భార్యకు బీరంటే ఇష్టం.. ఫ్రిజ్‌లో దాచింది.. భర్త తాగేసాడు.. కత్తెరతో చంపేసింది..

విదేశాల్లో ఆడామగా తేడా లేకుండా చుక్కేయడం తెలిసిందే. అలా భార్యాభర్తలు ఇంట్లోనే చుక్కేయడం విదేశాల్లో ఫ్యాషన్. ఆ ఫ్యాషనే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. పెన్సిల్వేనియాకు చెందిన ట్రేసీ

విదేశాల్లో ఆడామగా తేడా లేకుండా చుక్కేయడం తెలిసిందే. అలా భార్యాభర్తలు ఇంట్లోనే చుక్కేయడం విదేశాల్లో ఫ్యాషన్. ఆ ఫ్యాషనే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. పెన్సిల్వేనియాకు చెందిన ట్రేసీ లీ (45) దంపతులిద్దరూ ఆదివారం రాత్రి మద్యం సేవించారు. ఆ రోజు తనకిష్టమైన బీరును కాస్త మాత్రమే సేవించి.. మిగిల్చిన బీరును ఫ్రిజ్‌లో పెట్టింది. 
 
మరుసటి రోజు ఆ బీర్ కొట్టాల్సిందేనని భావించిన మహిళ.. బీర్ మాయం కావడంతో షాక్ అయ్యింది. తన భర్త రాత్రే తాను మిగిల్చిన బీర్‌ను లాగించేశాడని తెలిసాక కోపంతో ఊగిపోయింది. అంతే పక్కనున్న కత్తెరతో భర్తపై దాడికి దిగింది. మద్యం మత్తులో చేసిందో లేక కోపాన్ని ఆపుకోలేక దాడికి పాల్పడిందో తెలియదు కానీ.. భార్య కత్తెరతో చేసిన దాడికి భర్త తీవ్రంగా గాయపడ్డాడు. మెడకు, తలకు తీవ్రగాయాలవడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ట్రేసీ లీని పోలీసులు అరెస్ట్ చేశారు.