శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (12:01 IST)

ఐఎస్‌లో చేరేందుకు బయల్దేరిన 11 మంది భారతీయులు: గల్ఫ్‌లో అరెస్ట్!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యం నుంచే పౌరులు ఆసక్తి చూపిన నేపథ్యంలో.. భారతీయులు కూడా ఐఎస్‌లో చేరేందుకు బయల్దేరారనే షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఐఎస్ఐఎస్‌‍లో చేరేందుకు వెళ్లాలని బయల్దేరిన 11 మంది భారతీయులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. 
 
భారతీయులతో పాటు ఉగ్రవాదుల్లో చేరాలన్న ఆలోచనతో ఉన్న పాకిస్థానీ, బంగ్లాదేశీయులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో భారత్ నుంచి బయల్దేరిన ఈ 11 మంది ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున ధన సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. 
 
అంతటితో ఆగకుండా వారికి అవసరమైన సాంకేతిక పరికరాలను సరఫరా చేసే దిశగా సిరియాకు బయల్దేరని యూఏఈ భద్రతా దళాలు వెల్లడించాయి. వీరి ప్రణాళికలను ముందే పసిగట్టిన అధికారులు గత నెలారంభంలో అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని తెలుస్తోంది.