మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (18:47 IST)

ఐపీఎల్‌లో సిక్సర్ల మొనగాడు ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ ప్రారంభమై దశాబ్దంకాలం ముగిసిపోయింది. ఇపుడు 11వ యేటలోకి అడుగుపెట్టింది. అంటే ప్రస్తుతం ఐపీఎల్ పదకొండో సీజన్ జరుగుతోంది. అయితే, ఈ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన స్ట

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ ప్రారంభమై దశాబ్దంకాలం ముగిసిపోయింది. ఇపుడు 11వ యేటలోకి అడుగుపెట్టింది. అంటే ప్రస్తుతం ఐపీఎల్ పదకొండో సీజన్ జరుగుతోంది. అయితే, ఈ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు పాలు పంచుకుంటారు. వీరిలో ఒకరు భారత క్రికెటర్ రోహిత్ శర్మ. ఈ క్రికెటర్ ఐపీఎల్ సిక్సర్ల మొనగాడిగా మారాడు. ఎలాగో చూద్ధాం.
 
నిజంగా ఐపీఎల్-11లో తొలి మూడు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. సొంత అభిమానుల మధ్య అచ్చొచ్చిన మైదానంలో కెప్టెన్ విశ్వరూపం చూపించాడు. ఈ పోరులో రోహిత్ (94: 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న హిట్‌మ్యాన్ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 
 
బుధవారం వరకు ఐపీఎల్ టోర్నీలో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండోస్థానంలో సాధించాడు. భారత్ తరపున ప్రథమ స్థానం మాత్రం హిట్‌మ్యాన్‌దే. ఓవరాల్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా కరీబియన్ స్టార్ క్రిస్‌గేల్ 269 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 5 సిక్సర్లు బాదడంతో అతడి సిక్సర్ల సంఖ్య 179కి చేరింది. దీంతో అతడు ద్వితీయ స్థానం సంపాదించాడు. 
 
మూడో స్థానంలో సురేశ్ రైనా(174), ఏబీ డివిలియర్స్(166), విరాట్ కోహ్లీ(166) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ తన ఐపీఎల్ కెరీర్‌లో 163 మ్యాచ్‌ల్లో 4345 పరుగులు సాధించగా అందులో ఒక శతకంతో పాటు 33 అర్థశతకాలున్నాయి. మొత్తం 368 ఫోర్లు బాదాడు.