శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (15:11 IST)

కింద పడితే పగలదు... బ్రేక్ అయితే.. మోటొరోలా నుంచి కొత్త ఫోన్

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. దీంతో అన్ని ప్రధాన కంపెనీలు అత్యాధునిక ఫీచర్ ఫోన్ల తయారీపై దృష్టిపెడుతున్నాయి. తాజాగా మోటొరోలా నుంచి సరికొత్త పీచర్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీనిప

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. దీంతో అన్ని ప్రధాన కంపెనీలు అత్యాధునిక ఫీచర్ ఫోన్ల తయారీపై దృష్టిపెడుతున్నాయి. తాజాగా మోటొరోలా నుంచి సరికొత్త పీచర్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీనిపేరు జెడ్2 ఫోర్స్ స్మార్ట్ ఫోన్. 
 
లెనోవోకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్‌ను గురువారం డిల్లీ మార్కెట్‌లో ఆవిష్కరించారు. ఇది షట్టర్ ప్రూఫ్ డిస్ ప్లేతో, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్‌లో హై ఎండ్ చిప్ సెట్ 835తో వస్తుంది. షట్టర్ షీల్డ్ డిస్ ప్లే అన్నది ఎటువంటి గీతలు పడకుండా, స్క్రీన్ బ్రేక్ అవకుండా రక్షణ కోసం ఏర్పాటు చేసినది. కింద పడి స్క్రీన్ పగిలినా, బ్రేక్ అయినా నాలుగేళ్ల పాటు గ్యారంటీ ఇస్తోంది. దీన్ని లిమిటెడ్ ఎడిషన్‌గా మొటొరోలా విడుదల చేసింది.
 
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే, డ్యుయల్ నానో సిమ్, ఆండ్రాయిడ్ ఓరియో 8.0, 5.5 అంగుళాల క్యూహెచ్ డీ (1140, 2560 పిక్సల్స్) పోలెడ్ షట్టర్ షీల్డ్ డిస్ ప్లే, నీరు పడినా చుక్క కూడా లోపలికి వెళ్లకుండా ఉండేందుకు వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, క్వాల్ కామ్ 835 ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ, 2టీబీ వరకు ఎక్స్ పాండబుల్ మెమొరీ, ఆండ్రెనో 540 జీపీయూ, వెనుక భాగంలో 13 మెగా పిక్సల్స్ డ్యుయల్ కెమెరా (సోనీ సెన్సార్ తో), డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్, ముందు భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2730 ఎంఏహెచ్ బ్యాటరీ, కేవలం 15 నిమిషాల్లో 8 గంటలకు సరిపడా చార్జ్ చేసే టర్బో చార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.